తెలంగాణలో షర్మిల సీఎం కావడం ఖాయం : బైరెడ్డి రాజ శేఖర్ రెడ్డి

-

కర్నూలు : రాష్ట్ర విభజన తర్వాత నదీ జలాల వివాదంతో రాజకీయ లబ్ధి పొందాలని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజ శేఖర్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ వల్ల రాయలసీమ నీటి సమస్యలు తీరుతాయనే నమ్మకం ఉందని.. రాయలసీమ నీటి సమస్య, కరువును అడ్డంపెట్టుకొని చాలా మంది రాజకీయ లబ్ధి పొందారని పేర్కొన్నారు. తెలంగాణ నీళ్లు ఒక్క చుక్క నీరు పోనియ్యను షర్మిల అని అంటోందని.. దీంతో తెలంగాణలో షర్మిల సీఎం కావడం ఖాయం అని పేర్కొన్నారు. అమరావతిలో స్కిప్టు రెడీ చేసి పంపిస్తే షర్మిల చదువుతోందని ఫైర్‌ అయ్యారు.

తుంగభద్ర నదిపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడరని ఫైర్‌ అయ్యారు. రాయలసీమ ఎత్తిపొతల పథకం…రాయలసీమ కోసం నిర్మించడం లేదని.. రాయలసీమ ఎత్తిపొతల పథకం నుంచి 80 వేల క్యూసెక్కులు నీటిని ఎక్కడికి తీసుకెల్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమ ఎత్తిపొతల పథకం అనేది ఓట్లు సీట్ల కోసమే అన్నట్టుగా ఉందని.. రాయలసీమ ఎత్తిపొతల పథకం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ కే ఎసరొస్తుందని చెప్పారు.

రాయలసీమలోని ప్రాజెక్టుల నిర్మాణం, కాంట్రాక్టర్ల అక్రమా లపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని.. శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్, క్రాక్ లు, లీకేజీల వల్ల డ్యామ్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పవర్ ముఖ్యం కాదు.. రాయల సీమకు నీళ్లు ముఖ్యమని తెలిపారు. క్రిష్ణా రివర్ వ్యాలీ ద్వారా నీటి సమస్యలను తెలుసుకునే అవకాశం కల్పించాలని తెలిపారు. రాయలసీమలో కొత్తగా ఐదారు ప్రాజెక్టులు కడితే తప్ప రాయల సీమ బాగుపడుతుందని… రాయలసీమను ప్రధాని మోది దత్తత తీసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version