సీఏఏ నిబంధనలు భారత రాజ్యాంగ విరుద్ధం: సీఆర్ఎస్

-

సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.అయితే కేంద్రప్రభుత్వం తెచ్చిన సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పటికే పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా CAAలోని కొన్ని నిబంధనలు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని అమెరికా చట్టసభ పరిశోధన విభాగం సీఆర్ఎస్ ఓ నివేదికలో పేర్కొంది. పాక్, బంగ్లా, అఫ్గాన్ నుంచి భారత్కు వలస వచ్చిన ఆ దేశాల మైనారిటీలకు సీఏఏ ద్వారా భారత్ పౌరసత్వం అందిస్తుంది.

అయితే ముస్లింలను మినహాయించడం రాజ్యాంగానికి సమ్మతం కాదని సీఆర్ఎస్ పేర్కొంది. రాజకీయ కారణాలతోనే ఈ చట్టాన్ని సర్కారు తీసుకొచ్చిందని అభిప్రాయపడింది.కాగా, ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version