రేవంత్ రెడ్డికి పాలన అనుభవం శూన్యం : పొన్నాల లక్ష్మయ్య

-

బీజేపీతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు అని కేసీఆర్ అన్నారని.. గతంలో తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేసిన యత్నాలను కేసీఆర్ ఉదాహరించారన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ సీనియర్ కాంగ్రెస్ నేత 20 ఎమ్మెల్యేలను తీసుకొస్తా అంటే వారించా అని కేసీఆర్ ఆరోజు చెప్పారన్నారు. రేవంత్ మాత్రం ప్రతీసభలో కేసీఆర్ తన ప్రభుత్వానికి కూలుస్తారన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని, ప్రభుత్వం రాగానే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

జానారెడ్డి, జైపాల్ రెడ్డి అనుభవజ్ఞులు.. వారి గురించి కూడా చులకన చేసి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పాలన అనుభవం శూన్యమని.. లాగులో తొండలు అని ఏదో భాష మాట్లాడుతున్నారన్నారు పొన్నాల. పాలన చేయమంటే పనికి రాని మాటలు చెబుతున్నాడని.. దేవుండ్ల మీద ప్రమాణం చేయడం కాదు. గతంలో చెప్పిన డెడ్ లైన్ల పై నిలబడ్డాడా అని ఆయన ప్రశ్నించారు. పంట నష్టం మీద ఎప్పుడైనా ఈ సీఎం స్పందించారా..? అని ఆయన అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version