కేకే కు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకు : సీఎం రేవంత్

-

సీనియర్ నాయకుడు కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న కేశవరావు ఈరోజు ఎంపీ పదవికి రాజీనామా చేశారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేకే ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.తిరిగి సొంతగూటికి చేరిన కేకేతో సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేకే కు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా క్యాబినేట్ రాంక్ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

తెలంగాణాలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక 10 సంవత్సరాలు పక్కా ఉంటుందని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని, రెండోసారి కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.మూసి అభివృద్ధి పై దృష్టి పెట్టామని.. ఈ ప్రాజెక్టు తన పేరు పై రికార్డుగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు .మూసి అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ వ్యవహారంలో తప్పులకు ఆస్కారం ఇవ్వనని.. రూల్స్ ప్రకారమే ముందుకు పోతానని రేవంత్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version