రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న అఘోరీ వ్యవహారంపై అటు ప్రభుత్వాలకు, ఇటు పోలీసులకు కొత్త తలనొప్పిగా మారింది. తాజాగా అఘోరిపై షామీర్పీట్ పోలీస్ స్టేషన్లో జోగిని సంధ్య ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం పేరు చెప్పుకొని ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తోందని, హిజ్రాలకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తోందని సంధ్య ఆరోపించారు.సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఇలాంటి వాళ్లను సమాజం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
కాగా, సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, రెండురోజుల కిందట వైజాగ్ కు చెందిన వర్షిణి అనే అమ్మాయిని అఘోరీ పెళ్లి చేసుకుని మరో సంచలన రేపిన విషయం తెలిసిందే.తమ కూతురుని అఘోరీ ట్రాప్ చేసిందని వర్షిణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.