జూబ్లీహిల్స్ అమ్నీషియా, ఇన్​సోమ్నియా పబ్​లపై కేసు నమోదు

-

రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్​ హోరుతో సౌండ్ పొల్యూషన్ సృష్టించే పబ్​లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గతంలో పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పబ్​ల నిర్వహణలో నిబంధనలు, కోర్టు ఇచ్చిన ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని సూచించింది.నివాస ప్రాంతాల్లోని పబ్​లు సంగీత హోరుతో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని.. అక్కడకు వచ్చే వారు వాహనాలను ఇళ్ల ముందే నిలుపుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ఈ క్రమంలోనే హైదరాబాద్​ జూబ్లీహిల్స్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని పలు పబ్బులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. రాత్రి 10 దాటిన తర్వాత శబ్ద కాలుష్యం సృష్టించినందుకు చర్యలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్​లోని అమ్నీషియా, ఇన్​సోమ్నియా పబ్​ యజమానులు రాజా శ్రీకర్​, కునాల్​ కుక్రేజా, మేంజర్​ యూనిస్​లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version