దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్​ గరుడ’.. 175 మందిని అరెస్ట్ చేసిన సీబీఐ

-

‘ఆపరేషన్‌ గరుడ’ పేరిట దేశవ్యాప్తంగా సీబీఐ దాడులకు దిగింది. ఎన్సీబీ, ఇంటర్ పోల్ తో పాటు పలు రాష్ట్రాల్లోని పోలీసుల సమన్వయంతో దాడులు చేసింది. ఈ దాడుల్లో భారీగా మాదకద్రవ్యాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 127 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. 175 మంది డ్రగ్స్‌ వ్యాపారులను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు.

అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలను విచ్ఛిన్నం చేయడంతో పాటు డ్రగ్స్‌ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ఈ వారం ఆరంభం నుంచి కొనసాగిన ‘ఆపరేషన్‌ గరుడ’లో భాగంగా ఆయా ఏజెన్సీలు 127 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాయని సీబీఐ అధికారులు తెలిపారు. పంజాబ్, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్ర సహా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్సీబీ అధికారులు, పోలీసులు ఈ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు 6,600 మంది అనుమానితులను ట్రాక్‌ చేశారు. ఆ తర్వాత 127 కేసులు నమోదుచేసి పరారీలో ఉన్న ఆరుగురితో పాటు మొత్తం 175మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్‌ ఇతర పదార్థాల అక్రమ రవాణాను ఏజెన్సీలు లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version