ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కేసులో ట్విస్ట్ !

-

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఆయన ఫేస్ కట్ తో విడుదలైన ఓ వీడియో కారణంగా… మొన్నటి వరకు రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఈ వ్యవహారంపై మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సీబీఐ సైబర్ క్రైం సెల్ కు ఫిర్యాదు చేశారు.

సీబీఐ సైబర్ క్రైం సెల్ కు ఫిర్యాదు చేసారు హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ. ఈ ఫిర్యాదును ఈ-మెయిల్ ద్వారా చెన్నైలోని సీబీఐ కార్యాలయానికి పంపారు లక్ష్మీనారాయణ. ఈ ఫిర్యాదుతో పాటు మాధవ్ కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ లను కూడా జత చేసిన లక్ష్మీనారాయణ…మాధవ్ వ్యాఖ్యలతో రెండు వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు లక్ష్మీనారాయణ.మాధవ్ వ్యవహారంలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సీబీఐను కోరారు న్యాయవాది లక్ష్మీనారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version