హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మిస్టరీ డెత్

-

హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. అతడి రూమ్‌మేట్స్ ఎంతకొట్టినా తలుపులు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. తీరా వెళ్లి చూసేసరికి అతడు బెడ్‌రూమ్‌లో నేలపై అచేతనంగా పడిపోయి ఉన్నాడు. అసలేం జరిగిందంటే..?


‘మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్‌ కాలనీలో కృష్ణాజిల్లా గన్నవరం మండలం, నున్న గ్రామానికి చెందిన వర్జరక పూర్ణ సాయిసందీప్‌(22), అతని బంధువు యెర్కరెడ్డి భార్గవరెడ్డి(31), మరోవ్యక్తి జశ్వంత్‌తో కలిసి ఓ అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. భార్గవరెడ్డి ఐసీఐసీఐలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. సాయిసందీప్‌, జశ్వంత్‌ ఇటీవల ఊరెళ్లారు. మంగళవారం వచ్చిన సందీప్‌ ఫ్లాట్‌ తలుపు ఎంతసేపు తట్టినా భార్గవరెడ్డి తీయలేదు. వాచ్‌మెన్‌ సహాయంతో వంటగది చిమ్నీలో నుంచి లోపలికి వెళ్లగా, పడక గదిలో నేలపై భార్గవరెడ్డి మృతిచెంది ఉన్నాడు.’ అని నార్సింగి ఎస్‌ఐ సమరం రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version