తెలంగాణ రైతులకు ‘కేంద్రం’ గుడ్ న్యూస్..!!

-

తెలంగాణ రైతులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. ధాన్యం రైతులకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పింది.తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషణ్ రెడ్డిలు తెలిపారు.కేంద్ర మంత్రులు తెలంగాణలోని కేసిఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.

ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐ క్లియరెన్స్ ఇస్తుందని చెప్పారు పీయుష్ కుమార్. పేదలకు సాయం చేసేందుకు కేంద్రం చిత్తశుద్దితో పని చేస్తోందని తెలిపారు. పేదలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని అన్నారు. పేదలకు ఇంత అన్యాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని పీయూష్ గోయల్ విమర్శించారు.

దేశం మొత్తం మీద 80 కోట్ల మందికి అయిదు కేజీల చొప్పున అదనపు ధాన్యం ఇస్తున్నామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాజకీయ అజెండాతో కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిందలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిఆర్ ప్రతిదీ రాజకీయం చేయకుండా పేదల గురించి ఆలోచించాలని హిత బోధ చేశారు. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులపై తెలంగాణ సీఎం, మంత్రులు చాల అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసిఆర్ అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు.

రైస్ మిల్లర్ల పరిస్థితి దృష్ట్యా ధాన్యం కొనుగోలునకు కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రం ధాన్యం సేకరిస్తున్నా ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు..దేశంలో పేదలను ఆధుకోవడానికి కేంద్రం ఎప్పుడూ ముందు వుంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version