కేంద్రానికి ఒళ్ళు మండి అత్యంత సంచలన నిర్ణయం ?

-

ప్రపంచంలో అగ్రదేశాలు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలే కరోనా వైరస్ ముందు కరిగిపోతున్నాయి. వైరస్ ప్రమాదాన్ని అరికట్టలేక జనాలను కంట్రోల్ చేయలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో కరుణ పాజిటివ్ కేసుల సంఖ్య మరణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇటువంటి తరుణంలో ఇండియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా 21 రోజుల పాటు షట్ డౌన్ ప్రకటించడం జరిగింది. చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా కఠినంగా అమలు చేస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.అయితే కొన్నిచోట్ల గుంపులు గుంపులుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొన్ని రాష్ట్రాలలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో సొంత రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన వాళ్ళు కూడా పనులు లేకపోవటంతో తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లడానికి రెడీ అయ్యారు. అయితే దేశవ్యాప్తంగా రవాణా ఆగిపోవడంతో గుంపులుగుంపులుగా ఇతర రాష్ట్రాల సరిహద్దులు దాటుతూ పయనిస్తున్నారు. తాజాగా ఇటీవల మోడీ ‘మన్ కీ బాత్’ ఈ కార్యక్రమంలో ఇలాంటి పరిణామాలపై ఒళ్లు మండి అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 

వలసలను అడ్డుకునేందుకు ఎవరైనా పట్టణాల సరిహద్దులు దాటి బయటికి వెళ్ళిన దానికి బాధ్యులు కలెక్టర్లు మరియు ఎస్పీలు అని వాళ్ళ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆదేశించారు. భోజన వసతి అదేవిధంగా షెల్టర్ రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి అంటూ ఇటీవల సూచించారు. ముఖ్యంగా కరోనా వైరస్  గుంపులుగా వెళ్ళే వాళ్ళల్లో ఓ నలుగురికి సోకినా అది వందలమందికి సోకే అవకాశం ఉండటంతో రాబోయే రోజుల్లో…దీనిని నియంత్రించడానికి కేంద్రం మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.   

Read more RELATED
Recommended to you

Exit mobile version