సాయితేజ్ కుటుంబాన్ని ఆదుకోవాలి : చంద్ర‌బాబు డిమాండ్

-

త‌మిళనాడు లో జ‌రిగిన ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం లో మృతి చెందిన చిత్తూర్ వాసి సాయితేజ్ కుటుంబాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలు ఆర్పించిన సాయితేజ్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉంద‌ని అన్నారు. సాయితేజ్ కుటుంబానికి రూ. కోటి ప‌రిహారం ఇవ్వాల‌ని అన్నారు. అలాగే సాయితేజ్ కుటుంబం లో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాల‌ని అన్నారు.

అదే విధం గా వారి కుటుంబాని కి అన్ని విధాలు గా ప్ర‌భుత్వం అండ‌గా ఉండాల‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎస్ స‌మీర్ శ‌ర్మ కు చంద్ర బాబు లేఖ రాశారు. అంతే కాకుండా.. జ‌వాన్ సాయితేజ భార్య శ్యామల తో పాటు ఆయ‌న త‌మ్ముడు మ‌హేశ్ తో చంద్ర‌బాబు నాయుడు ఫోన్ ద్వారా మాట్లాడారు. త‌మ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని చంద్ర బాబు హామీ నిచ్చారు. అంతే కాకుండా చంద్ర‌బాబు జ‌వాన్ సాయితేజ కుటుంబానికి రూ. ల‌క్ష సాయం చేస్తాన‌ని ప్ర‌కటించారు.

Read more RELATED
Recommended to you

Latest news