చంద్రబాబు తిరుమల పవిత్రను అపవిత్రం చేశారు : జగన్

-

చంద్రబాబు తిరుమల పవిత్రను అపవిత్రం చేశారు అని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీని వైసీపీ అభివృద్ది చేసింది. లడ్డు తయారు చేసే జంతువు కొవ్వు అనేది ఓ కట్టు కథ. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా..? చంద్రబాబు అన్నారు. తిరుపతి లడ్డూ తయారిలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నానే ఆరోపణలు కట్టు కథలే. 

ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేస్తారా..? అని ప్రశ్నించారు. దేవుళ్లను కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి లాగారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని మండిపడ్డారు. 100 రోజుల పాలన పై చర్చజరుగకుండా ఉండేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి తిరుపతిలోని ఓ వ్యాన్ కి జులై 12న శాంపిల్స్ తీసుకున్నారు. సీఎంగా అప్పుడు చంద్రబాబు ఉన్నారు. జులై 17న శాంపిల్స్ కి NDDB టెస్ట్ చేసింది.జులై 23న రిపోర్టు వచ్చింది. అప్పుడు సీఎం చంద్రబాబే కదా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version