Breaking : హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ భవన్‌కు చంద్రబాబు.. కీలక నేతలతో సమావేశం

-

టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో పార్టీని మళ్లీ బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వెళ్లనున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, నియోజకవర్గాల కమిటీ సభ్యులతో భేటీ కానున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు చంద్రబాబు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్షను నిర్వహించనున్నారు చంద్రబాబు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ నిన్న మళ్లీ టీడీపీలో చేరారు. ఈ క్రమంలో బక్కని నరసింహులు స్థానంలో కాసానిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాసాని గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version