మహిళల కోసం చంద్రబాబు మరో పథకం..!

-

మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలని ప్రవేశపెట్టనున్నట్లు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు చెప్పారు. కలలకి రెక్కలు కార్యక్రమంలో ఆయన మాట్లాడటం జరిగింది. ఆడబిడ్డలకి ఉద్యోగాలు రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళల్లో చైతన్యం తీసుకువచ్చిన ఘనత తమది అని అన్నారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు ఏడాదికి 15000 చొప్పున తల్లికి వందనం కార్యక్రమం తీసుకువస్తామన్నారు.

ఇంట్లో ఎంతమంది ఉన్నా చదివించే అవకాశం కలుగుతుందన్నారు. మగవాళ్ళ తో సమానంగా ఆడపిల్లలు పని చేస్తున్నారన్నారు మగ పిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ ఆదాయం వస్తుంది అన్నారు. మెరుగైన అవకాశాలు ఇస్తే మహిళలు మరింత ముందుకు వెళ్తారు అన్నారు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు వచ్చాయంటే అది ఎన్టీఆర్ చొరవ అని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version