చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి – హరిరామ జోగయ్య

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలలోకి వెళ్లాలని సూచించారు కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్.. కాబోయే పవర్ కళ్యాణ్ అని వ్యాఖ్యానించారు హరిరామ జోగయ్య. తన విశ్లేషణలో ఆసక్తికర అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సీఎం జగన్ ని గద్దె దించాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని సీఎం చేసేందుకు చంద్రబాబు ముందుకు రాక తప్పదని జోగయ్య వ్యాఖ్యానించారు.

చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లాలని సూచించారు. లోకేష్ ని అధికారంలో భాగస్వామిని చేయాలన్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాలకు పరిమితమైతేనే టీడీపీ – జనసేన మధ్య సయోధ్య సాధ్యమని అన్నారు. సయోధ్య లేకుంటే 2024 లో ప్రతిపక్షాల ఓట్లు చీలుతాయన్నారు. ఇదే జరిగితే 2024 తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు అవుతుందంటూ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version