పార్టీలో గ్రూపులు కనిపించకూడదు..నెల రోజుల్లో మార్పు రావాలి : నేతలకు చంద్రబాబు వార్నింగ్‌

-

సొంత పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వార్నింగ్‌ ఇచ్చారు. నేతల పని తీరులో నెల రోజుల్లో సమూల మార్పు రావాల్సిందేనని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. పార్టీలో గ్రూపులు కనిపించకూడదని.. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడాలని పేర్కొన్నారు. పార్టీలో నేతల పనితీరులో ఇకపై స్పష్టమైన మార్పు కనిపించాలని హెచ్చరించారు చంద్రబాబు.

నియోజకవర్గ స్థాయిలో వివిధ విభాగాల్లో ఉన్న పార్టీ కమిటీల నియామకం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన కార్యాచరణతో పోరాటాలు మొదలు పెట్టాలని వెల్లడించారు. 15 రోజుల పాటు పార్లమెంట్ కో ఆర్డినేటర్లు క్షేత్ర స్థాయి పర్యటనలు జరపాలని కోరారు. గ్రూపు రాజకీయాలతో పార్టీకి నష్టం చేసే వారిని ఉపేక్షించేది లేదని.. ఇదే విషయాన్ని ఆయా నేతలకు అర్థం అయ్యేలా చెప్పాలని స్పష్టం చేశారు. అధికారమే లక్ష్యంగా పార్టీ నాయకులు పని చేయాలని.. అలాంటి వారికి తగిన గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version