ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్ కనిపించనున్నారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పాల్గొంటున్నారు.
ఈ భేటీలో పాల్గొంటామని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. దీంతో రేవంత్- కేటీఆర్ ఒకే వేదికపై కనిపించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్.. ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
- చెన్నైలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన
- నేడు డీలిమిటేషన్ సమావేశంలో పాల్గొననున్న సీఎం
- సీఎంతో పాటు సమావేశంలో పాల్గొననున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
- బీఆర్ఎస్ నుంచి పాల్గొననున్న కేటీఆర్