చిరు, చరణ్‌ కాంబినేషన్‌లో మళయాళ రీమేక్.. మెగా ఫ్యాన్స్ కు పండుగే..!

-

మెగాస్టార్ చిరంజీవి.. ఆయన కొడుకు రామ్ చరణ్ కలిసి స్క్రీన్ పై కనిపిస్తే మెగా ఫ్యాన్స్ కు పండుగే.. ఇప్పటికే వీరిద్దరూ కొన్ని సినిమాల్లో పాటల వరకూ కలసి కనిపించారు. ఆ మాత్రానికే మెగా ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు..

Ram Charan Cameo Role In Chiranjeevi 152 Movie

వారి ఎదురు చూపులు త్వరలోనే ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. రామ్ చరణ్ ఓ మళయాల సినిమా రీమేక్ హక్కులు కొన్నారు. ఆ సినిమాలో రెండు కీలకమైన పాత్రలను చిరంజీవి, రామ్ చరణ్ కలసి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తెలిపారు.

ప్రస్తుతం చిరంజీవి సైరా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తదుపరి చిత్రానికి కూడా రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వం ఓ సినిమా వచ్చే నెల్లోనే పట్టాలెక్కబోతోంది. అలాగే టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా చిరు కోసం ఓ స్టోరీ సిద్ధం చేస్తున్నారు. ఇవికాకుండామరో కథ కూడా చిరంజీవి కోసం రామ్ చరణ్ సిద్దం చేసారు.

మలయాళంలో విజయవంతమైన లూసిఫర్ సినిమా రీమేక్ హక్కుల్ని రామ్ చరణ్
సొంతం చేసుకొన్నారట. మలయాళ అగ్ర కథానాయకుడు పృథ్వీరాజ్ ఓ
కీలక పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన మూవీ ఇది. ఇందులో మరో టాప్ స్టార్ మోహన్ లాల్ కూడా నటించారు. రామ్ చరణ్ ఈ లూసిఫర్ రీమేక్ రైట్స్ ను తండ్రి చిరంజీవి కోసమే కొన్నారట.

అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ పోషించిన రోల్ చిరంజీవి, పృథ్వీరాజ్ రోల్
రామ్ చరణ్ చేసే అవకాశాలున్నాయట. సైరా రిలీజ్ తర్వాత దీనిపై ఫైనల్ డెసిషన్ తీసుకుంటారట. లూసిఫర్ తెలుగు రీమేక్‌లో చిరంజీవి, రామ్ చరణ్ కలసి నటిస్తే మెగా ఫ్యాన్స్ కు పూనకాలే అన్న సంగతి వేరే చెప్పనక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version