BREAKING : వైసిపి నేతలపై జగన్ కు చిరంజీవి ఫిర్యాదు !

-

మెగాస్టార్ చిరంజీవి కి, సీఎం జగన్ కు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై ఇవాల్టి సమావేశం లో ముఖ్యమంత్రి జగన్, చిరంజీవి చర్చించారు. టికెట్ రేట్లు పెంచే అంశాన్ని పరిశీలించాల్సిందిగా చిరంజీవి కోరినట్లు సమాచారం అందుతోంది. టికెట్ వ్యవహారంతో పాటు థియేటర్ల మలో కరెంట్ బిల్లులు, మినహాయింపులు, పలు ఇతర అంశాలను చిరంజీవి ప్రస్తావించినట్లు సమాచారం.

కొంత మందిని టార్గెట్ చేసుకునే ప్రభుత్వ నిర్ణయాలు అనే ప్రచారం పై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అలాంటి ఉద్దేశ్యం, అవసరం ప్రభుత్వానికి లేదని చిరంజీవికు సీఎం జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం అందుతోంది. ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఇండస్ట్రీ నమ్ముతోంది అని సీఎం అన్నట్లు సమాచారం.. వైసీపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంశాలూ ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

అంతేకాదు వైసీపీ నేతలపై చిరంజీవి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పరిశ్రమకు చెందిన వ్యక్తులు ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఎవరూ ఖండించ లేదు అని సీఎం పేర్కొన్నట్లు సమాచారం అందుతోంది. మరొక సారి మిగిలిన సినీ పెద్దలు అందరూ కలిసి వస్తాం అన్నారు చిరంజీవి. బీ, సీ సెంటర్ లలో టికెట్ రేట్లు పెంచే ఆలోచనలో ప్రభుత్వం.. ఈ నెలాఖరు నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చే విధంగా నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version