గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడీ దర్యాప్తు..వెలుగులోకి వస్తున్న సంచలన వాస్తవాలు

-

గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది.ఏపీబీసీఎస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అక్రమాలపై సీఐడీ కూపి లాగుతుంది.ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు.. అక్రమాలు జరిగిన తీరుపై నాటి ఉన్నతాధికారుల నుంచి సీఐడీ వివరాలు తీసుకుంటుంది.

వాసుదేవరెడ్డి పాత్రపై వెలుగులోకి వస్తున్న సంచలన వాస్తవాలు.

 

ఏపీబీసీఎల్ ఎండీతో పాటు, డిస్టలరీల కమిషనర్ గానూ వాసుదేవ రెడ్డికే జగన్ ప్రభుత్వం బాధ్యతలు కట్టబెట్టింది.

ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్లకు ఫైళ్లు పంపకుండా నిర్ణయాలు తీసుకునేలా వాసుదేవ రెడ్డికే అధికారాలు ఇచ్చింది.ట్రాన్సఫర్లు చేయించేస్తానంటూ ఉన్నతాధికారులను బెదిరించారని వాసుదేవరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.మద్యం కొనుగోళ్లలోనూ భారీగా అవకతవకలకు తెరలేపిన వాసుదేవ రెడ్డి..ఒకే బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధరకు కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైంది.ఒక్క వాసుదేవ రెడ్డి అవినీతే లెక్కలకు అందటం లేదని,బినామీ పేర్లతో కొన్ని డిస్టిలరీల్లోకి ఆయన చోరబడ్డారు.కొన్ని మద్యం బ్రాండ్లను రాత్రికి రాత్రే తప్పించినట్లు తెలుస్తోంది. తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లను గణనీయంగా జగన్ ప్రభుత్వం తగ్గించింది.2014-2019 మధ్యలో తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్ లు32 అందుబాటులో ఉంటే వాటిని రెండు బ్రాండ్లకే జగన్ ప్రభుత్వం కుదించింది.వాటిని అధిక ధరల కు విక్రయించి సొమ్ము చేసుకొని ప్రముఖ బ్రాండ్ల పేర్లతో పోలిన పేర్లు వచ్చేలా సొంత బ్రాండ్లను ప్రవేశపెట్టింది.

 

సొంత బ్రాండ్ల మద్యానికి అధిక ధరల ఎమ్మార్పీల నిర్ధారించింది.సబ్ లీజులు పేరుతో డిస్టిలరీలను జగన్ సన్నిహితులు కైవసం చేసుకున్నారు.11 డిస్టిలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నట్టు సీఐడీ విచారణలో వెల్లడైంది.హస్తగతం చేసుకున్న డిస్టిలరీల నుంచే 65 శాతం మేర మద్యాన్ని ఏపీలో కొనుగోళ్లకు వాసుదేవరెడ్డి అనుమతి ఇచ్చారు.2014-19 మధ్య కాలం లో ఉన్న టాప్ 5 మద్యం బ్రాండ్ మద్యాన్ని 2019 తర్వాత కొనుగోళ్లు నిలిపివేశారు.మద్యం నుంచి భవిష్యత్ నుంచి వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిన జగన్ ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని ఏపీఎస్డీసీకి రూ. 14,276 కోట్లు మళ్లించినట్టు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news