చావు కబురు చల్లగా పోస్టర్: మందు తాగుతున్న ఆమని..

-

కార్తికేయ హీరోగా తెరకెక్కిన చావు కబురు చల్లగా చిత్రం మార్చి 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లు షురూ చేసింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ విపరీతంగా ఆకర్షిస్తుంది. ఈ సినిమాలో హీరో అమ్మగా నటిస్తున్న ఆమని గారు, వంట చేస్తూ బిజీగా ఉంటూనే మందు తాగుతున్నట్టు కనిపించడమే వింతగా ఉంది. ఆమె ముందు మందు సీసా కనిపించడం విచిత్రంగా ఉంది.

ఇప్పటి వరకు ఆమని గారు ఇలాంటి పాత్ర చేసి ఉండరు. అప్పట్లో హీరోయిన్ గా ఎన్నో మంచి మంచి పాత్రలు పోషించినా ఇంత విభిన్నమైన పాత్ర చేయలేరు. అటు ట్రైలర్ కి రెస్పాన్స్ అదిరిపోయింది. ఇటు పాటలు కూడా బాగున్నాయి. చూస్తుంటే సినిమాకి మంచి బజ్ ఏర్పడేలా ఉంది. కామెడీగా ఉంటూనే జీవిత సత్యాన్ని చెప్పడానికి వస్తున్న ఈ సినిమాని కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ 2బ్యానర్లో బన్నీ వాసు నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version