సీఎం చంద్రబాబు నాయుడు రోడ్ షో.. పోటెత్తిన అభిమానులు ,కార్యకర్తలు

-

ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ రోడ్ షోకు టీ టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు.ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు నాయుడు నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీంతో చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ లీడర్లు ఘన స్వాగతం పలికారు.

బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి రోడ్ షో ద్వారా ర్యాలీ నిర్వహిస్తున్నారు. రోడ్డు మార్గంలో ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు కదులుతున్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.ఇక శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. విభజన సమస్యలపై చర్చించనున్నారు. దీంతో ఇద్దరి భేటీపై తెలుగు రాష్ట్రాలలో ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version