కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు – సీఎం జగన్

-

టాలీవుడ్‌ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల సీఎం జగన్‌ రియాక్ట్‌ అయ్యారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారని.. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారని గుర్తు చేసుకున్నారు సీఎం జగన్‌.

ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్వీట్‌ చేశారు ఏపీ సీఎం జగన్‌. అటు కైకాల సత్యనారాయణ మృతి పట్ల సంతాపం ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. కైకాల మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని చెప్పారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version