ఎన్టీఆర్‌, ఎంజీఆర్ లాగా సొంతపార్టీ పెట్టి, అధికారంలోకి వచ్చా – సీఎం జగన్

-

ఎన్టీఆర్‌, ఎంజీఆర్ లాగా సొంతపార్టీ పెట్టి, అధికారంలోకి వచ్చా అంటూ ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష రెండో విడద కార్యక్రమాన్ని నరసన్నపేటలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు.

పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి వస్తే ఎన్టీఆర్‌, ఎంజీఆర్, జగన్‌ అంటారు.. మామకు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కునేవారిని చంద్రబాబు అంటారన్నారు సీఎం వైఎస్‌ జగన్. రావణుడిని సమర్థించేవారిని రాక్షసులంటాం.. వెన్నుపోటు పొడిచిన నాయకుడిని అసెంబ్లీకి పంపాలా? ఇలాంటి వ్యక్తికి మరోఛాన్స్‌ ఇస్తారా? మీ సేవలు వద్దు బైబై బాబు అని ఇంటికి పంపాలా? వద్దా? అని ప్రశ్నించారు వైఎస్ జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version