మహిళల కోసం.. జగన్ కీలక నిర్ణయం..!

-

అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మీదనే దృష్టి పెట్టారు. ప్రజాపాలనే లక్ష్యంగా ముదుకు వెళ్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా వరుసగా అమలు చేసుకుంటూ పాలనలో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు పేదింటి అక్కల కోసం ‘వైఎస్ఆర్ చేయూత’ పధకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ పధకం ద్వారా 45-60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు గాను రూ. 75 వేల ఆర్ధిక సాయాన్ని ఉచితంగా అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24.19 లక్షల మంది మహిళలు ఈ పధకం ద్వారా లబ్ది పొందనుండగా.. దీని అమలుకు ఏపీ ప్రభుత్వం ఒక్కో ఏడాదికి రూ.4,535.70 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.18,142.8 కోట్లను ఖర్చు చేయనుంది. కాగా, అధికారిక వర్గాల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 45-60 ఏళ్లు కలిగిన మహిళలు ఎస్సీలలో 5.89 లక్షల మంది, ఎస్టీలలో 1.63 లక్షల మంది, బీసీల్లో 15.26 లక్షల మంది, మైనార్టీ లలో 1.40 లక్షల మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version