జులై 9 నుంచి రైతు భరోసా చైతన్య యాత్రలు : సీఎం జగన్

-

కరోనా వ్యాక్సినేషన్‌, వ్యవసాయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..ప్రతినెలా మొదటి శుక్రవారం ఆర్బీకే స్థాయిల్లో, ప్రతి నెలా రెండో శుక్రవారం మండల, ప్రతినెల మూడో శుక్రవారం జిల్లా స్థాయ్లిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు కచ్చితంగా జరగాలని ఆదేశాలు జారీ చేశారు. జులై 9 నుంచి 23 వరకూ రైతు భరోసా చైతన్యయాత్రలు నిర్వహించాలన్నారు.


ఆర్బీకేల విధివిధానాలు, సీఎం యాప్‌ పనితీరు, ఇ– క్రాపింగ్‌ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.  సీఎం జగన్ వ్యాక్సినేషన్‌ ద్వారానే కోవిడ్‌కు పరిష్కారమని.. వ్యాక్సినేషన్‌లో ఇంకా చాలా దూరం మనం వెళ్లాల్సి ఉందన్నారు. సెకండ్‌ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని.. ఇవ్వాల్సిన టైంలో వారికి సెకండ్‌ డోస్‌ ఇవ్వకపోతే వ్యాక్సిన్‌ వృథా అవుతుందని వెల్లడించారు. 45 పైబడి ఉన్న వయస్సు వారికి 90శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి అయితే మిగిలిన కేటగిరీలపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version