BREAKING : నేడు దర్శి, విజయవాడలో సీఎం జగన్‌ పర్యటన

-

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ బిజీ షెడ్యూల్‌ గడుపనున్నారు. నేడు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ మరియు దర్శ పర్యటనకు వెళుతున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి హాజరుకానున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం 5.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి విజయవాడకు బయలుదేరనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. 5.30 గంటలకు విజయవాడ ఏ ప్లస్‌ కన్వెన్షన్‌కు చేరుకోనున్న సీఎం వైఎస్‌ జగన్‌… క్రిస్మస్‌ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆ తర్వాత దర్శికి వెళ్లి, సాయంత్రం 8 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version