ఇవాళ 1,072 కోట్ల పెట్టుబడులకు సీఎం జగన్‌ శ్రీకారం

-

ఇవాళ 1,072 కోట్ల పెట్టుబడులకు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల ఏర్పాటుపై వైఎస్‌ జగన్ సర్కార్ ఫోకస్ చేసింది. వరుసగా రెండో రోజు పలు పరిశ్రమలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు.

CM Jagan’s initiative for investments of 1,072 crores today

ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా పాల్గొననున్నారు సీఎం జగన్‌. ఇవాళ 1,072 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ నంద్యాల, కడప జిల్లాల పర్యటనకు పయనం కానున్నారు. రేపు నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన ఉండనుంది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version