ఎల్లుండి ఇడుపులపాయలో సీఎం జగన్‌ పర్యటన

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం జగన్ కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. సెప్టెంబర్ ఒకటిన తాడేపల్లి నుంచి కడప కు బయలు దేరనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి… ఇడుపుల పాయ లో రాత్రి బస చేయనున్నారు. ఇక సెప్టెంబర్ 2 వ తేదీన ఉదయం 9.30 లకు ఇడుపులపాయ లో వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పించనున్నారు సీఎం జగన్‌.

అనంతరం తాడేపల్లి కి తిరుగు ప్రయాణం చేయనున్నారు సీఎం జగన్‌. అయితే.. సెప్టెంబర్ 2 న వైఎస్సార్ 12 వ వర్థంతి ఉన్న నేపథ్యం లో ఇడుపుల పాయకు వెళ్లనున్నారు సీఎం జగన్‌. ప్రస్తుతం ఫ్యామిలీ తో సిమ్లా టూర్‌ లో ఉన్నారు సీఎం జగన్‌. సిమ్లా పర్యటన నుంచి రేపు తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు సీఎం జగన్. ఎల్లుండి నుంచి కడప జిల్లా టూర్‌ తో బిజీ కానున్నారు. ఇది ఇలా ఉండగా.. వైఎస్సార్ 12 వ వర్థంతి రోజైన వైఎస్‌ షర్మిల తో జగన్‌ కలుస్తారా ? లేదా ? అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version