ఈ నెల 30న సీఎం జగన్‌ నంద్యాల, కడప జిల్లాల పర్యటన

-

ఈ నెల 30న సీఎం వైఎస్‌ జగన్‌ నంద్యాల, కడప జిల్లాల పర్యటనకు పయనం కానున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్. కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి…ఈ మేరకు ఈ నెల 30న ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు.

CM YS Jagan’s visit to Nujivedu of Eluru district today

ఈ తరుణంలోనే… నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికు వెళతారు సీఎం జగన్‌. అక్కడి నుంచి అవుకు రెండవ టన్నెల్‌ సైట్‌కు చేరుకోనున్నారు సీఎం జగన్‌. నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్…ఫొటో ఎగ్జిబిషన్‌ పరిశీలన, పైలాన్‌ ఆవిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా కడపకు సీఎం జగన్… కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్నారు. ఇక సాయంత్రం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version