ఢిల్లీకి బయలు దేరిన సీఎం కేసీఆర్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… దేశ రాజధాని ఢిల్లీకి బయలు దేరారు. కాసేపటి క్రితమే ప్రగతి భవన్ నుంచి.. ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు సీఎం కేసీఆర్. ఇక సీఎం కేసీఆర్ తో పాటు… రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మరియు సీఎస్ సోమేష్ కుమార్ ఢిల్లీ పయనమయ్యారు.

ఇక ఢిల్లీ పర్యటనలో రేపు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షకావత్ తో సమావేశమౌతారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. అనంతరం 26వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా నేతృత్వంలో… జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ కీలక సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశం పై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో మాట్లాడుతారు. ఇక 26 తేదీ సాయంత్రమే తెలంగాణ సీఎం కేసీఆర్ హైదారాబాద్ తిరుగు ప్రయాణమౌతారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version