కేటీఆర్‌ ఇలాకలో సీఎం కేసీఆర్‌ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

-

రాజన్న సిరిసిల్ల జిల్లా : కాసేపటి క్రితమే సీఎం కేసీఆర్ సిరిసిల్ల చేరుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు సీఎం కేసీఆర్‌ కు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్, ప్రశాంత్ రెడ్డి వచ్చారు. సిరిసిల్లకు చేరుకున్న వెంటనే…నియోజకవర్గంలో నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా మండెపల్లిలో అన్ని సౌకర్యాలతో నిర్మించిన డబల్ బెడ్ రూం ఇండ్ల సముదాయమైన కేసీఆర్ నగర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్‌… మంత్రి కేటీఆర్ తో కలిసి ప్రారంభించారు.

అనంతరం 15 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు సీఎం కేసీఆర్‌. ఈ కార్యక్రమం అనంతరం తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. దాని అనంతరం సిరిసిల్లలో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనం ప్రారంభోత్సవం, సర్ధాపూర్ లో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిం చనున్నారు.  అనంతరం ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్(కలెక్టరేట్) భవనం ప్రారంభోత్సంలో పాల్గొంటారు సీఎం కేసీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version