వేరే మహిళతో సహజీవనం.. భార్యకు ఫొటోలు పెడుతూ భర్త టార్చర్

-

తాను వేరే మహిళతో ఉంటూ ప్రైవేట్‌‌గా ఉన్న ఫోటోలు, వీడియోలు పంపి వేధిస్తున్న భర్తకు భార్య తగిన బుద్ది చెప్పింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి అతన్ని పట్టించింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. భార్య అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్‌ఐసీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. భర్త కిరణ్‌ నెల్లూరు జిల్లాలో డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, కొంతకాలంగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కిరణ్‌..వాళ్లతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను భార్యకు పంపి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు .దీంతో ఆమె అరండల్‌పేట పోలీసులను ఆశ్రయించగా.. కిరణ్‌కుమార్‌ను అదుపులో తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఆ భర్త వికృత చేష్టలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version