కమెడియన్ సునీల్ దశ తిరిగినట్టేనా.. ఏకంగా 4 సినిమాలలో..!

-

కమెడియన్ సునీల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేముందు ఎవరు ఎన్ని కష్టాలు పడ్డా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక క్రేజ్ వచ్చిందంటే ఇక అవన్నీ వారు మర్చిపోతూ సక్సెస్ ఎంజాయ్ చేసే ప్రయత్నంలోనే ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే సునీల్ కూడా ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత కమెడియన్ గా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత హీరోగా తన కెరీర్ను మార్చుకున్నాడు. అంతే కాదు విలన్ గా కూడా తనలోని విలనిజాన్ని చూపించి ప్రేక్షకులను తన నటనతో భయపెట్టేసాడు. ఇకపోతే అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకున్న సునీల్ ఏ రోజు కూడా సినీ ఇండస్ట్రీకి దూరం కాలేదు.

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కమెడియన్స్ తన కెరీర్లో జెట్ స్పీడ్ లో వెళ్తున్నాడనే వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం సునీల్ వరుసగా నలుగురు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నారు. ఇక ఈ నాలుగు సినిమాలు సక్సెస్ సాధిస్తే సునీల్ కెరీర్ కు కచ్చితంగా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. పుష్ప ది రైజ్ సినిమాలో విలన్ పాత్రతో ప్రేక్షకులను అలరించిన మంగళం శ్రీను పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. అంతేకాదు తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఇక ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.ప్రస్తుతం శంకర్ , రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో సునీల్ నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా విజయవంతం అయితే సునీల్ కెరీర్ కు ప్లస్ అవుతుందనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. మరొక రెండు సినిమాలలో కూడా ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. ఇకపోతే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలలో సునీల్ పాత్రకు మంచి ప్రాముఖ్యత లభించింది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు రాబోతున్న త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ సినిమాలో కూడా సునీల్ నటించబోతున్నాడు. ఇక అంతే కాదు కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే సినిమాలో కూడా సునీల్ నటిస్తున్నాడు. ఇక ఈ నాలుగు సినిమాలు మంచి విజయం సాధిస్తే సునీల్ కెరియర్ దశ తిరిగినట్టే.

Read more RELATED
Recommended to you

Exit mobile version