కర్ణాటకలో ఆగని మత విద్వేషాలు.. ముస్లిం యువకుడిపై దాడి

-

కర్ణాటక రాష్ట్రంలో మత విద్వేషాలు ముదురుతున్నాయి. అయితే.. బీజేపీ యువమోర్చ నేత హత్యతో నివురుగప్పిన నిప్పులా ఉన్న కర్ణాటకలో మరో వివాదాస్పద ఘటన చేసుకున్నది. మంగళూరు శివార్లలో ఓ ముస్లిం యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో మంగళూరు, దాని సమీప ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గురువారం రాత్రి 8 గంటల సమయంలో సూరత్కల్‌లో ముసుగులతో వచ్చిన నలుగురు వ్యక్తులు మహ్మద్‌ ఫాజిల్‌ అనే యువకుడిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అతడిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు పోలీసులు. దాడి నేపథ్యంలో సూరత్కల్‌, పనంబూరు, ముల్కీ, బాజ్‌పే ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నామని మంగళూరు పోలీస్‌ కమిషనర్‌ శశి కుమార్‌ చెప్పారు. ప్రజలు ఎవరూ గుమికూడటానికి వీల్లేదని స్పష్టం చేశారు. శుక్రవారం కావడంతో ముస్లింపు వారివారి ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరు శాంతియుతంగా ఉండాలని, బాధితునికి వీలైనంత తొందరగా తగిన న్యాయం చేస్తామన్నారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకుంటామని చెప్పారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version