హైదరాబాద్ లో టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన

-

 తెలంగాణ అసెంబ్లీ దగ్గర పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. టిఆర్టి అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడి కోసం గేటు దగ్గరకు వెళ్లడంతో.. ఒక్కసోరిగా ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్‌తో వారు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో తీవ్ర ఉద్రిక్తంగా మారిన డీఎడ్..  బీఎడ్ అభ్యర్థుల స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరెట్ ముట్టడించారు. 

నిజాం కళాశాల నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ వస్తున్న డిఎడ్.. బీఎడ్ అభ్యర్థుల పై లాఠీ ఛార్జ్ చేశారు  పోలీసులు. అసెంబ్లీ దగ్గర లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు. మరోవైపు  మీడియా ప్రతినిధులను సైతం  తోసేసి అరెస్ట్ చేస్తామని dcp వార్నింగ్ ఇచ్చాడు.  డిఎడ్..బీఎడ్ అభ్యర్థుల పైన కూడా  ఏసీపీ వెంకటేశ్వర్లు అత్యుత్సాహం కనబరిచారు. అభ్యర్థులను కొట్టండి ఇండ్చేయండి అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పలువురు అభ్యర్థుల పై పోలీసుల లాఠీ ఛార్జ్. DCP వెంకటేశ్వర్లు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు మాపై కావాలనే లాఠీ చార్జి రెచ్చ గొడుతున్నరని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ముట్టడికి వస్తే మేము చేతులు కట్టుకొని ఉరుకుంటామా..? లాఠీ ఛార్జ్ చేసి..అరెస్ట్ చేస్తాం. ప్రభుత్వానికి టైం ఇవ్వక రెండో సారి ప్రొటెస్ట్ ఎందుకూ చేస్తున్నారు ? మేము కేసులు పెడితే మీకు ఉద్యోగాలు కూడా రావు అని.. లా అండ్ ఆర్డర్  కి అడ్డంకులు సృష్టిస్తున్నారు. విడతల వారిగా స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి వస్తున్న అభ్యర్థులు వీరిని పోలీసులు అడ్డుకుంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version