Congress : 30 లక్షల ఉద్యోగాల వివరాలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్

-

ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే గాంధీ భవన్‌లో కాంగ్రెస్ అధికార ప్రతినిధులు జ్ఞాన సుందర్,భవాని రెడ్డి, ఏఐసీసీ మీడియా ఇంచార్జ్ సునీతా పాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవాని రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని , ఆ 30 లక్షల ఉద్యోగాల వివరాలు కవిత చెప్పాలని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాలలో కుల గణనపై కనీసం నిర్ణయం తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ నోటీసులు వచ్చిన ప్రతిసారీ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ వెళ్లి టెంట్ వేస్తదని ఎద్దేవ చేశారు. కేసీఆర్ సర్కార్ పదేళ్లలో మహిళాభివృద్ధి కోసం ఏం చేయలేదన్నారు. తాము మహిళల కోసం చర్యలు తీసుకుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

ఏఐసీసీ మీడియా ఇంచార్జీ సునీతా పాల్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రజల సీఎం అని, ప్రజల కోసం ఆలోచిస్తున్నారని చెప్పారు. కేటీఆర్ మాత్రం ప్రజలని వాడుకుంటూ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు . ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంకా యాభై రోజులు కూడా కాలేదని, అప్పుడే విమర్శలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేస్తోందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాక బీఆర్ఎస్ నేతలు మతిస్థిమితం కోల్పోయారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news