కాంగ్రెస్ అంటే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి : హరీష్ రావు

-

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో మీడియా సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆగస్టు 15 లోపు 39 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు ఇంకా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అంటున్నాడు అని ఎద్దేవ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించాలో చెప్పాలి అన్నారు.మిమ్మల్ని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయి.రైతురుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు 2500 రూపాయల సహయం, కళ్యాణాలక్ష్మి కి తులం బంగారం, నిరుద్యోగ భృతి పై మాట తప్పినందుకు కాంగ్రెస్ ని ఓడించాలి.నాలుగున్నర నెలల్లోనే సీఎం ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి.కాంగ్రెస్ అంటే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2014, 2019 రెండు సార్లు దేశంలో కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్కలేదు..మీ పాలన వద్దని ప్రజలు అనుకుంటున్నారు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version