భారత్ జోడో యాత్ర జోరు చూడలేకే బీజేపీ ‘ఆపరేషన్ కీచడ్’

-

గోవాలో బీజేపీ ఆకర్ష్ మంత్రాపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. గోవాలో ఎనిమిది మంది హస్తం ఎమ్మెల్యేలు కాషాయతీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కాంగ్రెస్ తనదైన శైలిలో బీజేపీపై విరుచుకుపడింది.

భారత్​ జోడో యాత్రకు వస్తున్న ఆదరణను చూడలేకే బీజేపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో జోరు పెంచిందని ఆరోపించింది కాంగ్రెస్. గోవాలో 8 మంది కాంగ్రెస్​ శాసనసభ్యులు బుధవారం కమలదళంలో చేరడం.. భాజపా చేపట్టిన ‘ఆపరేషన్​ కీచడ్(బురద)’లో భాగమని దుయ్యబట్టింది.

“భారత్​ జోడో యాత్ర విజయాన్ని చూసి భాజపా కంగారు పడుతోంది. అందుకే గోవాలో ఆపరేషన్​ కీచడ్​ను ముమ్మరం చేసింది. యాత్రను తక్కువ చేసి చూపేందుకు ఇప్పటికే భాజపా అసత్య ప్రచారాలు సాగిస్తోంది. అయినా.. మేము వెనక్కు తగ్గం. భాజపా కుయుక్తులు అన్నింటినీ అధిగమిస్తాం” అని ట్వీట్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ కమ్యూనికేషన్స్ విభాగం బాధ్యుడు జైరాం రమేశ్.

గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు గానూ భాజపా 20 సీట్లు దక్కించుకుంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గిన నేపథ్యంలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది బుధవారం భాజపాలో చేరిపోయారు. మూడింట రెండొంతుల మంది పార్టీని వీడిన నేపథ్యంలో… ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వీరు తప్పించుకున్నట్లైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version