అమర్నాథ్ యాత్రపై దాడికి కుట్ర..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత బలగాలు

-

కాశ్మీరులోయలో అమర్నాథ్ యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రికుల పై దాడి చేసే కుట్రతో భారత్ లో ప్రవేశించిన పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. హతమైన ముగ్గురు టెర్రరిస్టులు పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులని పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి కీలక ఆధారాలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ Igp విజయ్ కుమార్ వెల్లడించారు.

శ్రీనగర్ లోని బెమీనా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మృతి చెందిన వారిలో ఒకరిని అబ్దుల్లా గౌజ్రీ గా గుర్తించినట్లు ఆయన చెప్పారు. పాకిస్థాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ వీరిని భారత్ కు పంపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించిన మార్గాల్లో భద్రతా బలగాలు పహారాను పటిష్టం చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version