పాఠశాలల్లో కరోనా కలకలం.. ఒకే స్కూల్ లో 29 మందికి కరోనా పాజిటివ్

-

స్కూళ్లు, కాలేజీలు కరోనా హాట్ స్పాట్లుగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో పలు పాఠశాలలు, కళాశాలల్లో పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ కరోనా బారిన పడ్డారు. కర్ణాటక ధార్వాడ్ మెడికల్ కాలేజీలో 281 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఓడిశాలో కూడా ఇదే విధంగా విద్యార్థులకు పెద్ద సంఖ్యలో కరోనా సోకింది.

తాజాగా తెలంగాణ సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలోని జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. పాఠశాలలోని విద్యార్థినులకు టెస్టులు చేయగా… రెండ్రోజులలో 29 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారుర. మిగతా విద్యార్థినులను క్వారంటైన్ కు తరలించారు.

ఇది వరకు ఇలాగే తెలంగాణలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా సోకింది. ఇంతకు ముందు సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని గురుకులంలో 45 మందికి.. ఖమ్మం జిల్లా వైరా గురుకులంలో 27 మందికి కరోనా వైరస్ సోకింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version