హమ్మయ్య ఇండియాలో తగ్గుముఖం పట్టిన సెకండ్ వేవ్…?

-

భారత్ లో కరోనా రెండో వేవ్ కి సంబంధించి ఇప్పుడు ప్రజల్లో కాస్త ఆందోళన ఉంది. కరోనా కేసులతో పాటుగా మరణాలు కూడా భారీగా నమోదు కావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రెండు రోజుల నుంచి కూడా కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,29,942 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

3,56,082 మంది నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకున్నారు. 3,876 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు: 2,29,92,517 గా ఉన్నాయి. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,90,27,304 గా ఉంది. మరణాల సంఖ్య 2,49,992 గా ఉండగా క్రియాశీల కేసులు 37,15,221 గా ఉన్నాయి. కరోనా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 17,27,10,066 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version