చంద్రబాబుకు కరోనా టెన్షన్.. సన్నిహితంగా మెదిలిన నేతకు పాజిటివ్ ?

-

తిరుపతి పార్లమెంట్ పరిధిలోని శ్రీకాళహస్తి టీడీపీ ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సుధీర్ రెడ్డి హోం క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు చంద్రబాబు అండ్ కో లో కరోనా టెన్షన్ నెలకొంది. దానికి కారణం 8వ తేదీ శ్రీకాళహస్తిలో చంద్రబాబు తో కలిసి బహిరంగ సభలో సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

ఆ సభలో మాస్క్ లేకుండా చంద్రబాబుతో సన్నిహితంగా సుధీర్ రెడ్డి మాట్లాడారు. దీంతో చంద్రబాబు సహా ఆ సభకు హాజరయిన ముఖ్య నేతలు కూడా కరోనా వలన టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. తిరుపతిలో ఎలా అయినా గెలవాలని అధికార ప్రతిపక్షాల వారు ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున మొహరిస్తే, తెలుగు దేశం కూడా అగ్ర నేతలు అందరినీ అక్కడే మొహరించి ప్రచారం చేస్తోంది. మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో ? వేచి చూడాలి మరి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version