తెలుగు రాష్ట్రాలపై కరోనా పంజా.. కేసుల్లో ఆల్ టైమ్ రికార్డ్..!

-

తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,045 కరోనా కేసులు నమోదు కాగా, 65 మంది మరణించినట్టు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 6,494 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 64,713కి చేరింది. వీరిలో కరోనా నుంచి 32,127 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 823 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 31,763 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

అలాగే తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది మరణించారు. 1,281 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,259కి చేరింది. 438 మంది చనిపోయారు. తెలంగాణలో ఇప్పటివరకు 37,666 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,155 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version