తగ్గని కరోనా కేసులు.. గత 24 గంటల్లో 542 మంది మృతి..!

-

కరోనా సమస్య ఇంకా తప్పడం లేదు. ప్రతీ రోజు మన దేశంలో వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏది ఏమైనా సోషల్ డిస్టెన్స్ పాటించడం, బయటకు వెళ్తే మాస్క్ ధరించడం వంటి నియమాలని పాటిస్తే మంచిది.

 

corona cases | కరోనా కేసులు

ఆరోగ్యకరమైన సూత్రాలని పాటించడం తగిన జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి.
ఇక గత 24 గంటల్లో కరోనా వైరస్ కి సంబంధించి అప్డేట్స్ గురించి చూస్తే..

కరోనా కేసులు దేశంలో ఇంకా ఎక్కువగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 38,949 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 542 మంది మరణించారు. దీనితో ఇప్పటి వరకు 412531 మంది చనిపోయారు అని తాజా నివేదిక ద్వారా తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే రికవరీ వివరాలలోకి వెళితే… దేశంలో మరో 40026 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి రికవరీ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకూ 30183876 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు.ఇంకా 4,30,422 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకూ 39,53,43,767 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ద్వారా తెలుస్తోంది. 38,78,078 మందికి 24 గంటల్లో వ్యాక్సిన్లు వేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version