బ్రేకింగ్ ;ఏపీ లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు …!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత వేగంగా పెరుగుతుంది. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో 35 కొత్త కేసులు నమోదు అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఇప్పటి వరకు 757 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 96 మంది కోలుకున్నారు. కర్నూలు 10, గుంటూరు 9, కడప 6 కేసులు, పశ్చిమ గోదావరి నాలుగు కేసులు నమోదు అయ్యాయి.

అనంతపురం 3 కేసులు, కృష్ణాలో మూడు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు బయటపడ్డాయి. దాదాపు 180 మందికి పైగా కరోనా వైరస్ సోకింది. తెలంగాణా రాయలసీమ సరిహద్దుల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version