మహేష్ – రాజమౌళి కాంబో నుంచి క్రేజీ అప్డేట్.. ఫాన్స్ కి పూనకాలే..!!

-

ప్రస్తుతం మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాను తెరకేక్కించబోతున్న విషయం తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. యాక్షన్ అడ్వెంచర్గా అత్యంత భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ తెరపైకి రాబోతోందని సమాచారం. ఇకపోతే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని మొదలుపెట్టిన జక్కన్న ఈ క్రేజీ ప్రాజెక్టును వచ్చే ఏడాది నుంచి ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశాడు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా యదార్థ సంఘటనల సమూహారంగా తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.

ఇక ఇదే విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో కూడా రాజమౌళి అలాగే ఆయన తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా వెల్లడించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్పీడ్ తో మొదలుపెట్టారట. రాజమౌళి ఇప్పటికే ఇంటర్నేషనల్ స్టూడియోతో ఈ సినిమా కోసం భారీ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్న రాజమౌళి.. ఈ ప్రాజెక్టుపై మరింత హాట్ టాపిక్ గా నిలపడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబో నుంచి వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడిగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొనేను సంప్రదిస్తున్నారట. ఇప్పటికే తనకు లైన్ వినిపించిన రాజమౌళి తనతో చర్చలు జరుపుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రభాస్ తో నాగ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్టు కే సినిమాలో నటిస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత దీపిక.. రాజమౌళి , మహేష్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం అని కూడా స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ..దీపికా పదుకొనే క్రేజ్ కూడా పెరిగిపోతుందని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version