ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సలార్ అప్డేట్.. అభిమానులు సిద్ధంకండి..

-

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తరువాత ప్రభాస్ కు టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. దీంతో ప్రభాస్ ప్రతి చిత్రం పాన్ ఇండియాలో చిత్రీకరణ జరుగుతోంది. అయితే ప్రభాస్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చిన ప్రభాస్ అభిమానులే కాకుండా ఇతర స్టార్ల అభిమానులు కూడా ఆసక్తిగా ఉంటారు. ప్రస్తుతం డార్లింగ్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీని చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన అప్డేట్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది అంటున్నారు అభిమానులు.

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 లాంటి భారీ ప్రాజెక్టులు తెర‌కెక్కించింది హోంబ‌లే ఫిలిమ్స్. ఈ భారీ నిర్మాణ సంస్థ ప్ర‌భాస్ తో స‌లార్ ప్రాజెక్టు చేస్తోంది. అండ‌ర్ వ‌ర‌ల్డ్ యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంతో తెర‌కెక్కుతున్న ఈ భారీ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర వార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. సలార్ సినిమాలో ఇంట‌ర్వెల్ సీక్వెన్స్ సినిమాకే మెయిన్ హైలెట్‌గా నిలిచేలా డైరెక్టర్ డిజైన్ చేశారట. ఈ సింగిల్ యాక్ష‌న్‌ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖ‌ర్చుపెడుతున్నార‌న్నట్లు సమాచారం. లోయ‌ల్లో తీయ‌బోయే భారీ ఛేజింగ్ అండ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌కు గూస్ బంప్స్ తెప్పించ‌డం ఖాయమనే వార్త షికార్లు కొడుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version