ఒకే మహిళతో ఇద్దరు అక్రమ సంబంధం..చివరికి..!

-

ఇటీవల ఫలక్ నుమా లో షేక్ అబ్బాస్ అనే యువకుడి హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. షేక్ అబ్బాస్ ను అచ్చిరెడ్డి నగర్ కు చెందిన మహమ్మద్ పర్వేజ్, నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన మహమ్మద్ సాహెబ్ కలిసి హత్య చేశారు. వీరిలో మహమ్మద్ పర్వేజ్ రెండేళ్లుగా ఓ మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే అదే మహిళతో 18 నెలలుగా అబ్బాస్ కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై పై మహిళ తో పాటు అబ్బాస్ ను కూడా పర్వేజ్ హెచ్చరించాడు.

రిలేషన్ షిప్ ను కట్ చేసుకోవాలని మహిళను హెచ్చరించాడు. అయినప్పటికీ ఇద్దరూ తమ అక్రమ సంభందాన్ని కొనసాగించారు. దాంతో ఎలాగైనా అబ్బాస్ ను హతమార్చాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడు సాహెబ్ తో కలిసి పర్వేజ్ ను మాట్లాడాలని చెప్పి ఫోన్ చేసి పిలిపించి హతమార్చాడు. కత్తులతో అతి దారుణంగా పొడిచి అబ్బాస్ ను హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారించరించగా ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version